Darjeeling : రుచికరమైన పుష్కా తయారు చేసి అందరికీ పంచిన Mamata Banerjee
ABN , First Publish Date - 2022-07-12T23:06:30+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. డార్జిలింగ్లో మంగళవారం ఓ స్టాల్ వద్దకు వెళ్లి, పుష్కా తయారు చేసి, అందరికీ పంచారు. దీంతో అక్కడ ఉన్నవారంతా సంభ్రమాశ్చర్యాలకులోనయ్యారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు.
మమత మూడు రోజులపాటు డార్జిలింగ్లో పర్యటిస్తారు. మాల్ రోడ్డులో స్వయం సహాయక బృందం మహిళలు నిర్వహిస్తున్న ఓ పుష్కా స్టాల్ వద్దకు ఆమె మంగళవారం వెళ్ళారు. పుష్కాలను తయారు చేసి, బాలలకు, అక్కడ నిల్చున్నవారికి ఇచ్చారు. వారంతా ఈ పుష్కాలను ఆస్వాదించడంతోపాటు చాలా సంతోషించారు. ముఖ్యమంత్రి స్వయంగా తయారు చేసి, తమకు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
మమత మార్చిలో కూడా డార్జిలింగ్లో ఓ మోమో స్టాల్ వద్ద అమ్మకందారులకు సాయపడ్డారు. ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.