సువేందు విజయంపై మమత ఎన్నికల పిటిషన్
ABN , First Publish Date - 2021-06-18T05:08:57+05:30 IST
సువేందు విజయంపై మమత ఎన్నికల పిటిషన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ సువేందు అధికారిపై కలకత్తా హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సింగిల్ బెంచ్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. హైకోర్టు వెబ్సైట్లో విడుదల చేసిన కాజ్ లిస్ట్ ప్రకారం.. జస్టిస్ కౌశిక్ చందా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ పిటిషన్ ప్రవేశపెట్టన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అధికారి విజయం సాధించినట్టు ప్రకటించిన ఈసీ... మమత రెండో స్థానంలో నిలిచినట్టు ప్రకటింది. ఈవీఎం మెషీన్ల ట్యాంపరింగ్ జరిగిందనీ.. రీకౌంటింగ్ జరపమని పదే పదే కోరినా ఈసీ అందుకు అంగీకరించలేదని మమత తన సిటిషన్లో పేర్కొన్నారు.