మల్సూర్‌ ఆశయాలను కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:12:43+05:30 IST

మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్‌ ఆశయాలను కొనసాగించాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న అన్నారు.

మల్సూర్‌ ఆశయాలను కొనసాగించాలి
సిరికొండలో మల్సూర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

మోతె, జనవరి 15 : మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్‌ ఆశయాలను కొనసాగించాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న అన్నారు. సిరికొండలో ఉప్పుల మల్సూర్‌ 21వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించి, మాట్లాడారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి తన కోసం సంపాదించుకోకుండా అనునిత్యం పేద ప్రజల కోసం సేవలు చేసిన మహోన్నత వ్యక్తి మల్సూర్‌ అన్నారు. ఆయన కుటుంబానికి ఇల్లు లేదని, డబుల్‌ బెడ్‌రూంను మంజూరుచేయాలని మంత్రి జగదీ్‌షరెడ్డిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వసుకుల మట్టయ్య, యస్‌కే నజీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:12:43+05:30 IST