బాధ్యతలు చేపట్టిన మలోల
ABN , First Publish Date - 2020-08-15T10:01:11+05:30 IST
జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎ.మలోల శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ లోని తన చాంబరు లో బాధ్యతలు చేపట్టిన
కడప (కలెక్టరేట్), ఆగస్టు 14: జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎ.మలోల శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ లోని తన చాంబరు లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కడప ఆర్డీవోగా పనిచేయడంతో జిల్లాలో అన్ని శాఖల సిబ్బంది సుపరిచితమన్నారు. పదోన్నతిపై ఇదే జిల్లాకు డీఆర్వోగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగయ్య, ఎస్డీసీ సూపరింటెండెంట్లు జీవన్, రామ్మోహన్, చంద్రశేఖర్ తదతరులు డీఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.