కాంగ్రెస్ గొప్ప నేతను కోల్పోయింది.. పార్టీకి తీరని లోటు : మల్లిఖార్జున ఖర్గే

ABN , First Publish Date - 2021-12-05T19:41:26+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు...

కాంగ్రెస్ గొప్ప నేతను కోల్పోయింది.. పార్టీకి తీరని లోటు : మల్లిఖార్జున ఖర్గే

న్యూఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చి మాజీ సీఎం మృతదేహానికి నివాళులు అర్పించిన ఆయన.. రోశయ్య సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నేతను కోల్పోయిందన్నారు. సోనియాగాంధీ ఫోన్ చేసి ఏఐసీసీ పక్షాన నివాళులు అర్పించడానికి తనను ఇక్కడికి పంపించారని మీడియాకు తెలిపారు. రోశయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. 16 ఏళ్లు ఆర్ధికమంత్రిగా అద్భుతంగా పని చేశారు. రోశయ్య వివాద రహితుడు. ఏ మంత్రిపదవి ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు. వారి మృతికి ఏఐసీసీ పక్షాన సంతాపం తెలుపుతున్నాను. రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.

Updated Date - 2021-12-05T19:41:26+05:30 IST