ఎంత పనిచేశావ్‌..మల్లారెడ్డీ!

ABN , First Publish Date - 2021-06-19T06:04:46+05:30 IST

మల్లన్నసాగర్‌లో సర్వం కోల్పోయినా తనకు ఇల్లు ఇవ్వడం లేదన్న మనోవ్యధతో 70 ఏళ్ల మల్లారెడ్డి...సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కూల్చిన తన ఇంట్లోని కట్టెలపైనే సజీవంగా దహనమవడం జిల్లాలో కలకలం సృష్టించింది.

ఎంత పనిచేశావ్‌..మల్లారెడ్డీ!
వేములఘాట్‌ గ్రామంలో రైతు మల్లారెడ్డి ఇంట్లోనే చితి పేర్చుకుని సజీవదహనమైన ప్రాంతం

మల్లన్నసాగర్‌లో సర్వం కోల్పోయినా తనకు ఇల్లు  ఇవ్వడం లేదన్న మనోవ్యధతో 70 ఏళ్ల మల్లారెడ్డి...సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కూల్చిన తన ఇంట్లోని కట్టెలపైనే సజీవంగా దహనమవడం జిల్లాలో కలకలం సృష్టించింది. నిర్వాసితుల ఆవేదనను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన బలిదానం లోకానికి చాటిచెప్పింది. చనిపోయేముందు తన ఇంటిపై ఉన్న ప్రేమను, సొంతూరిపై మమకారాన్ని వదులుకోలేక వదులుకోలేక కూల్చిన ఇంటి కట్టెలపైనే బూడిదవడం స్థానికులనే కాదు.. మల్లన్నసాగర్‌లో సర్వం కోల్పోయిన వారిని కలవరపరిచింది. పరిస్థితిని లోకానికి వివరించింది. ప్రభుత్వం పరిహారం ఇచ్చేతీరునూ పరిహాసం చేసింది. మల్లారెడ్డి ఆత్మహత్యతో ఊరుఊరంతా బోరుమని విలపించింది.  



Updated Date - 2021-06-19T06:04:46+05:30 IST