రేవంత్రెడ్డికి మల్లారెడ్డి సూచన
ABN , First Publish Date - 2021-08-28T21:12:40+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన సవాల్ను స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన సవాల్ను స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి ఇలాంటి సవాళ్లు స్వీకరిస్తేనే కదా ప్రజల్లోకి వెళ్లేదని సూచించారు. జిరాక్స్ పేపర్లు తెచ్చి ఏదో చెప్తే సరిపోతుందా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. దొంగ కాగితాలతో రేవంత్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మల్లారెడ్డి కాలేజీల్లో ఏ ప్రాబ్లమ్ లేదని హెచ్ఆర్డీ మినిస్టర్ రాత పూర్వకంగా ఇచ్చారని గుర్తుచేశారు. రేవంత్ ఎంపీ అయినా బ్లాక్మెయిల్ బుద్ధి పోలేదని తప్పుబట్టారు. రేవంత్రెడ్డి తన హోదాకి తగ్గట్టూ నడుచుకోవాలని మల్లారెడ్డి హెచ్చరించారు.