మల్లన్న సాగర్ ప్రాజెక్టు అక్రమాలపై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-12-28T23:58:56+05:30 IST

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 40 వేల కోట్ల...

మల్లన్న సాగర్ ప్రాజెక్టు అక్రమాలపై విచారణ వాయిదా

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 40 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లపై అంచనాలు పెంచారని, ప్రాజెక్టు అంచనా పెరగడంపై అవకతవకలు జరిగాయని  రిటైర్డ్ ఇంజనీర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించలేదని మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2021-12-28T23:58:56+05:30 IST