మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-02-23T19:55:06+05:30 IST
కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.
సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్తో 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. అనేక వివాదాల నడుమ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.