మల్లన్న హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు

ABN , First Publish Date - 2022-02-19T01:33:14+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపేణా

మల్లన్న హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపేణా రూ.2,62,74,717 లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. ఈ కానుకలను భక్తులు 38 రోజులలో సమర్పించారు. పటిష్ఠమైన భద్రత మధ్య హుండీలను నిర్వహించారు. శ్రీశైలంలో ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ  వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 1న మహాశివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు.

Updated Date - 2022-02-19T01:33:14+05:30 IST