బీజేపీ నేతలపై ఎమ్మెల్యే మైనంపల్లి ఫైర్

ABN , First Publish Date - 2022-03-16T19:21:51+05:30 IST

బీజేపీ నేతలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలపై ఎమ్మెల్యే మైనంపల్లి ఫైర్

హైదరాబాద్: బీజేపీ నేతలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అభివృద్ధిని అడ్డుకుంటూ స్థానికులను రెచ్చగొడుతున్న బీజేపీ నేత రామచంద్రరావు గారు... కబ్జా స్థలాలు చేసిన వారికి సహకరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు అలాంటి వారిని ప్రోత్సహించకండి...ఎంతటి వారైనా సరే కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం’’ అని హెచ్చరించారు. ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులను విడుదల చేసిందని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ప్రజాదర్భార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.


నాగిరెడ్డి చెరువుపై కబ్జా చేసిన ఫంక్షన్ హల్ నిర్మాణాన్ని కూల్చేసినందుకే రామచంద్రరావు  అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ’’నిజంగా నేను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా... మరి నేను మీరు చేసిన తప్పులను చూపిస్తే మీరేం చేస్తారు చెప్పండి.. నాపై ఖబడ్దార్ అనే ముందు ఒకసారి మీ ఆత్మ విమర్శన చేసుకోవాలి. మీకు నేను చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను రామచంద్రరావు గారు’’ అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-16T19:21:51+05:30 IST