భారత్, పాక్ మంచి మిత్రులు కావాలన్నదే నా కల: మలాలా

ABN , First Publish Date - 2021-03-01T18:15:13+05:30 IST

భారత్-పాకిస్తాన్ మధ్య ఒకప్పటి విధానాలు ఇప్పుడు పనిచేయవని పాకిస్తాన్ హక్కుల కార్యకర్త, నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రజలు విద్వేషాలను మర్చిపోయి శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారని..

భారత్, పాక్ మంచి మిత్రులు కావాలన్నదే నా కల: మలాలా

ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య ఒకప్పటి విధానాలు ఇప్పుడు పనిచేయవని పాకిస్తాన్ హక్కుల కార్యకర్త, నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రజలు విద్వేషాలను మర్చిపోయి శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. భారత్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో భాగంగా మలాలా యూసఫ్ జాయ్ రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకంపై ఆమెతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగానే ఆమెతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలాలా.. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి మాట్లాడారు. 


భారత్, పాకిస్తాన్‌ దేశాలు మంచి స్నేహితులుగా మారాలన్నదే తన కల అని మలాలా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని, వారి రక్షణకు అన్ని దేశాలూ కలిసిరావాలని కోరారు. ‘పాకిస్తాన్, భారత్‌లే కాదు.. అన్ని దేశాల్లోనూ మైనారిటీలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. దీనికి కారణం మతం కాదు. అధికార దురహంకారం వల్ల జరుగుతోంది. దీనిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల’ని పిలుపునిచ్చారు

Updated Date - 2021-03-01T18:15:13+05:30 IST