మాల మహానాడుకు యువకులతో కమిటీలు

ABN , First Publish Date - 2021-01-18T06:14:33+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించి మాల మహానాడు అన్ని కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమించనున్నట్లు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు.

మాల మహానాడుకు యువకులతో కమిటీలు

ఖైరతాబాద్‌ జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించి మాల మహానాడు అన్ని కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమించనున్నట్లు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌ మింట్‌కాంపౌండ్‌లో అంబేడ్కర్‌ స్ఫూర్తి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. మాల మహానాడు రాష్ట్ర కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకొని, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి గ్రామ, నియోజకవర్గ స్థాయి, జిల్లా, రాష్ట్ర కమిటీలను యువకులతో నియమిస్తామన్నారు. వీటితోపాటు మహిళ, న్యాయవాద, విద్యార్థి, అసంఘటిత కార్మిక రంగం, మేధావులు, మాల ఉద్యోగ సంఘాలకు కార్యవర్గాలను నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రతినిధులు వాడాల భాస్కర్‌, జి.రమేష్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T06:14:33+05:30 IST