mla Controversial comments సిద్దిపేట: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-28T17:33:16+05:30 IST
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట (Siddipeta): జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (MLA Muthireddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేశారు. టీఆర్ఎస్ (TRS)కు ఓటు వేసేవాళ్లకే దళిత బంధు (Dalita Bandhu) ఇస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా, కొమురవెల్లిలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దళితబంధు ఎంపికపై అధికారులకు సూచనలు ఇచ్చారు. తెలంగాణ సోయ ఉన్నవాళ్లకే పథకాలు (schemes) వర్తింపచేయాలన్నారు. కేసీఆర్ (KCR), టీఆర్ఎస్కు ఓట్లు వేసేవాళ్లకే దళితబంధు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.