వైభవంగా మకరజ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2021-01-16T06:34:43+05:30 IST

ఆలమూరు అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనంగా వైభవంగా జరిగింది. జ్యోతులతో ఆభరణాలను ఊరేగించారు.

వైభవంగా మకరజ్యోతి దర్శనం

ఆలమూరు, జనవరి 15: ఆలమూరు అయ్యప్పస్వామి ఆలయంలో  మకరజ్యోతి దర్శనంగా వైభవంగా జరిగింది. జ్యోతులతో ఆభరణాలను ఊరేగించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక నుంచి జ్యోతి దర్శనం కల్పించారు. ఆలయానికి ప్రక్కనే ఉన్న చెరువులో స్వామివారి తెప్పొత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం: ముమ్మిడివరంలో శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. బాజాభజంత్రీలు, మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ ముమ్మిడివరం పురవీధుల్లో అయ్యప్పస్వామిని ఊరేగించారు. అయ్యప్పస్వామి మకరజ్యోతిరూపంలో దర్శన మించారు.  కార్యక్రమంలో పెన్మెత్స జగ్గప్పరాజు, సరిపెల్ల రామకృష్ణంరాజు, వేములవలస చిన్నారావు, బీఎస్‌ఆర్‌ చౌదరి, కృష్ణ పాల్గొన్నారు.
ఆత్రేయపురం: ర్యాలి అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం రాత్రి మకర జ్యోతిని భక్తులు వీక్షించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పయాగం తదితర  పూజలు అర్చకస్వాములు ఘనంగా నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాఅయ్యప్ప జ్యోతిదర్శనాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-01-16T06:34:43+05:30 IST