నేటి రక్తదాన శిబిరాలను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2022-01-18T04:55:31+05:30 IST
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని 18వ తేదీ మంగళవారం కడప పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి
ప్రొద్దుటూరు క్రైం, జనవరి 17 : ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని 18వ తేదీ మంగళవారం కడప పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. అనంతరం జరిగే రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు రక్తదానం చేయాలని కోరారు.