ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-10-19T06:20:24+05:30 IST

మండల కేంద్రంలోని డ్యాం రోడ్డు సమీపంలో మంగళవారం నిర్వహిం చనున్న శింగనమల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు.

ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముంటిమడుగు కేశవరెడ్డి


 : ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి

గార్లదిన్నె, అక్టోబరు18 : మండల కేంద్రంలోని డ్యాం రోడ్డు సమీపంలో మంగళవారం నిర్వహిం చనున్న శింగనమల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మీయకలయిక కార్యక్రమ ఏర్పాట్లను ఆ యన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్మీయ కలయిక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

శింగనమల: గార్లదిన్నెలో మంగళవారం జరిగే టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని  టీడీపీ శింగనమల నాయకులు దండు శ్రీనివాసులు సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అఽధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-10-19T06:20:24+05:30 IST