సందేశ్ యాత్రను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2021-04-13T04:36:08+05:30 IST
పూలే, అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ కోరారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 12: పూలే, అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ కోరారు. సోమవారం మునిసిపల్ కేంద్రంలో ఒకటవ వార్డు, ఖానాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు అజయ్కుమార్ మాట్లాడుతూ పూలే, అంబేడ్కర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించిన మహనీయులని కొనియాడారు. వారి ఆశ యాలను కొనసాగించేందుకు బడుగు, బలహీన వర్గాల వారు ఉద్యమించాలన్నారు. అ దేవిధంగా ఈ నెల 14న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పూలే, అంబేడ్కర్ సందేశ్ యాత్ర విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు భక్తరాజు, నాయకులు రాజు, అంబేడ్కర్ జాతర కమిటీ నాయకులు చంద్రశేఖర్, వేణు గోపాల్, లక్ష్మన్న, లూతర్, వెంకట్ రాములు పాల్గొన్నారు.