బంద్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-03-05T06:28:59+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని, ప్లాంట్‌ పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఎం గాజువాక డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాతయ్యపాలెం వద్ద కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

బంద్‌ను విజయవంతం చేయండి
నాతయ్యపాలెంలో రాస్తారోకో చేస్తున్న సీపీఎం నేతలు

అక్కిరెడ్డిపాలెం, మార్చి 4: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని, ప్లాంట్‌ పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఎం గాజువాక డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాతయ్యపాలెం వద్ద కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ గాజువాక అధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందని, విశాఖ వాసులు ఈ ప్రక్రియలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజువాక పరిధిలోని సీపీఎం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:28:59+05:30 IST