పోలీసు సిబ్బంది ఓపికతో ఉండేలా చూడండి
ABN , First Publish Date - 2020-03-29T11:15:20+05:30 IST
ప్రస్తుతం రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితి నెలకొందని, ప్రజలతో మాట్లాడేటప్పుడు పోలీసు సిబ్బంది ఓపికతో ఉండేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డిని మానవ
డీజీపీకి మానవ హక్కుల వేదిక లేఖ
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ: ప్రస్తుతం రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితి నెలకొందని, ప్రజలతో మాట్లాడేటప్పుడు పోలీసు సిబ్బంది ఓపికతో ఉండేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డిని మానవ హక్కుల వేదిక కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎడతెరపి లేకుండా విధులు నిర్వహిస్తున్నారని వేదిక సభ్యులు ప్రశంసించారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న తమ సొంత గ్రామాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకొని దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఆ కూలీల్లో మహిళలు, వృద్ధులు ఉన్నారని మానవ హక్కుల వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, ఎస్. జీవన్ కుమార్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు.. పేదలకు భోజన, వైద్య సదుపాయాలు కల్పించాలని హెచ్ఆర్డబ్ల్యూ దక్షిణాసియా డెరెక్టర్ మీనాక్షి గంగూలీ కోరారు.