రైతు శంఖారావాన్ని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-04-13T05:52:03+05:30 IST

విశాఖ బీచ్‌ రోడ్డులో ఈ నెల 18న జరిగే రైతు, కార్మిక శంఖారావం సభను విజయవంతం చేయాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య పిలుపునిచ్చారు.

రైతు శంఖారావాన్ని విజయవంతం చేయండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రైతు, కార్మిక నాయకులు

కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జములయ్య


అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 12: విశాఖ బీచ్‌ రోడ్డులో ఈ నెల 18న జరిగే రైతు, కార్మిక శంఖారావం సభను విజయవంతం చేయాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డిరామునాయుడు భవనంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను విరమించుకోవాలని కోరుతూ ఈ  సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సభకు రైతు ఉద్యమ నాయకులు రాకేష్‌సింగ్‌ తికాయత్‌, అశోక్‌ దావాలే, వడ్డే శోభనాద్రేశ్వరరావు తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సంఘం ప్రతినిదులు విల్లూరి మహాలక్ష్మినాయుడు, ఎ.బాలకృష్ణ, గాడి బాలు, పీఎస్‌ అజయ్‌కుమార్‌, కోరిబిల్లి శంకరరావు, ఆళ్ల మహేశ్వరరావు, కాండ్రేగుల రఘు, శేషసాయి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:52:03+05:30 IST