ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేయండి
ABN , First Publish Date - 2021-04-16T07:22:23+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే రేఖానాయక్కు రిటైర్డ్ ఉద్యోగుల వినతి
ఖానాపూర్, ఏప్రిల్ 15 : ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాము 2020 జూలై మాసంలో ఉద్యోగ విరమణ పొం దామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో చేసిన పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపొందించడం తో పాటు ఈ ఏడాది మార్చి నుండి అది వర్తిస్తుందని ప్రకటించారన్నారు. దీంతో తమకు ఆ వెసులుబాటు వర్తించక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమను కూడా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేసి తమ కుటుంబాలకు అండగా నిలువాలని రిటైర్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే రేఖానాయక్ను కోరా రు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకట్రమణ, ఐతం శంకర్, రాజేశ్వర్, నర్సింగ్రావు, లచ్చన్న, రాములు, రవికుమార్ తదితరులున్నారు.