కొండచరియల విలయం: శిథిలాల కింద 40 మంది
ABN , First Publish Date - 2021-08-11T20:43:24+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విలయం సృష్టించాయి. భారీగా..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విలయం సృష్టించాయి. భారీగా కొండ చరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు సహా, పలు వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయినట్టు డిప్యూటీ కమిషనర్ అబిత్ హుస్సేన్ షేఖ్ బుధవారంనాడు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోందని, కిన్నౌర్ నుంచి సిమ్లా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు. దీంతో ఆర్మీ, ఇండోటిబిటన్ బోర్డ్ పోలీసులు, జాతీయ విపత్తుల స్పందన బృందం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. పెవో-సిమ్లా హైవేపై మధ్యాహ్నం 12.45 గంటలకు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అన్నారు.