సమస్యల్లో మేజర్‌

ABN , First Publish Date - 2022-05-16T05:17:47+05:30 IST

ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు కూడా మేజ ర్‌గానే ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ వా ర్డుల్లో కాలువల నిర్మాణం జరగలేదు.

సమస్యల్లో మేజర్‌
ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా హైవే రోడ్డు వద్ద కదలని మురుగు

వార్డుల్లో లేని కాలువలు

కదలని మురుగు 

ప్రధాన డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు

దోమలతో నరకం చూస్తున్న 

వైపాలెం పట్టణ వాసులు

ఎర్రగొండపాలెం, మే 15 : ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు కూడా మేజ ర్‌గానే ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ వా ర్డుల్లో కాలువల నిర్మాణం జరగలేదు. వర్షం, వాడుక నీరు రోడ్లపైనే నిలిచి ఉండిపోతోంది. దీంతో వీధులు కంపుకొడుతున్నాయి. పగలు రాత్రి దోమలతో స్థానికులు నరకం చూస్తు న్నారు. చిన్నపాటి చినుకులకే రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతాయి. వీధి చివర, మూలమలుపు వ ద్ద మురుగు నీరు వారాలు, నెలల తరబడి నిల్వ ఉండిపోవడంతో దోమలు, ఈగలు, విష పరుగులకు ఆవాసకేంద్రంగా మారుతోంది. ఇం దిరానగర్‌ మసీదు బసార్‌లో కాలువలు ఉన్న ప్పటికీ  మురుగునీరు రోజుల తరబడి కా ల్వల్లో  నిల్వ ఉంటుంది. మురుగు నీరు ముం దుకు కదలడంలేదు. హైవే రోడ్డు పక్కన 1000 మీటర్ల పొడవున లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కాలువలు నిర్మించారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కాలువలను ఆక్రమించి భవనాలు, బడ్డీ దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలువ లోపల పేరుకుపోయిన చెత్త, మురుగు తొలగించేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో కాలువలు పారక తీవ్రమైన కంపు కొడుతోంది. దోమల వ్యాప్తి కూడా తీవ్ర మవుతోంది. ప్రజలు జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో కాలువలపై ఆక్రమణలు తొలగించాలని, పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలని, దోమల నుంచి కాపాడాలని పట్టణవాసులు మొత్తుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2022-05-16T05:17:47+05:30 IST