అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ
ABN , First Publish Date - 2021-07-27T06:06:21+05:30 IST
ఎలమంచిలి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు సోమవారం సందర్శించారు.
ఎలమంచిలి, జూలై 26 : ఎలమంచిలి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు సోమవారం సందర్శించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా ఇక్కడికి విచ్చేసి స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఎస్ఐలు మణికంఠరావు, సన్నిబాబు, ట్రాఫిక్ ఎస్ఐ వెంకట్రావు పాల్గొన్నారు.