షుగర్ ఫ్యాక్టరీలో పనికోసం వెళ్లిన యువతి.. అక్కడ అర్ధరాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-03-04T05:49:17+05:30 IST

ఒక షుగర్ ఫ్యాక్టరీలో క్లీనింగ్ పనిచేసే యువతిపై ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అత్యాచారం చేశారు. ఆ తరువాత అత్యాచారం చేసేటప్పుడు తీసిన వీడియోని ఇంటర్నెట్‌లో వైరల్ చేశారు. ఈ ఘటన అత్యాచారాలకు రాజధానిగా...

షుగర్ ఫ్యాక్టరీలో పనికోసం వెళ్లిన యువతి.. అక్కడ అర్ధరాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏం చేశారంటే..

ఒక షుగర్ ఫ్యాక్టరీలో క్లీనింగ్ పనిచేసే యువతిపై ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అత్యాచారం చేశారు. ఆ తరువాత అత్యాచారం చేసేటప్పుడు తీసిన వీడియోని ఇంటర్నెట్‌లో వైరల్ చేశారు. ఈ ఘటన అత్యాచారాలకు రాజధానిగా మారిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లోనే నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి వంట చేసేందుకు, క్లీనింగ్ పనిచేసేందకు ఇంట్లో ఒక యువతిని పనిమనిషిని పెట్టుకున్నాడు. 


ఆ యువతి షుగర్ ఫ్యాక్టరీలోని క్వార్టర్స్‌లో పనిచేసేందుకు ప్రతిరోజూ ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుంది. కానీ ఇటీవల ఒకరోజు ఆమె పని చేయడానికి వెళ్లినప్పుడు ఆ ఇంటి ఓనర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేసే ఇద్దరు యువకులు.. ఆ యువతి పనిచేసే ఇంట్లోకి దూసుకొచ్చి ఆ ఇంటి ఓనర్‌ని తీసుకెళుతుండగా.. అడ్డుపడిన పనిమనిషిపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. చెబితే.. అత్యాచారం చేస్తుండగా.. తీసిన వీడియోని వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.


తనపై జరిగిన అన్యాయాన్ని ఆ యువతి తన కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో వారంతా కలిసి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు నిందితులైన సెక్యూరిటీ గార్డులను విచారణ చేయడానికి వెళ్లగా.. వారిద్దరూ ఆ అత్యాచారం వీడియోని వైరల్ చేసి పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసు నమోదు చేసి.. గాలిస్తున్నారు.


Updated Date - 2022-03-04T05:49:17+05:30 IST