7,500కే అధునాతన వెంటిలేటర్లు

ABN , First Publish Date - 2020-03-27T07:28:12+05:30 IST

కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.7,500కే అధునాతన వెంటిలేటర్లను అందిస్తామని మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు...

7,500కే అధునాతన వెంటిలేటర్లు

  • మామూలుగా అయితే రూ.5-10 లక్షలు 
  • అతి చౌకగా అధునాతన నమూనా రూపొందించాం
  • అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం
  • ఆనంద్‌ మహీంద్ర  

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.7,500కే అధునాతన వెంటిలేటర్లను అందిస్తామని మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు. అంబు బ్యాగ్‌గా పిలిచే వెంటిలే టర్‌ నమూనాను అభివృద్ధి చేశామని తెలిపారు. కొన్ని అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు. దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని ట్వీట్‌ చేశారు. అధునాతన వెంటిలేటర్ల మిషను ఖరీదు రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుందన్నారు. తమ బృందం అతి తక్కువ ధరకే అందించేలా అభివృద్ధి చేసిందని తెలిపారు. కేవలం 48 గంటల్లో నమూనా వెంటిలేటర్‌ను రూపొందించారన్నారు. 

Updated Date - 2020-03-27T07:28:12+05:30 IST