శ్రీలంక ప్రధానిగా మహిందా రాజపక్స ప్రమాణం
ABN , First Publish Date - 2020-08-10T07:58:43+05:30 IST
శ్రీలంక ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉత్తర కొలంబోలో కెలానియాలోని ప్రాచీన బౌద్ధాలయంలో ఉదయం 9.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది...
కొలంబో, ఆగస్టు 9: శ్రీలంక ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉత్తర కొలంబోలో కెలానియాలోని ప్రాచీన బౌద్ధాలయంలో ఉదయం 9.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అధ్యక్షుడు, తమ్ముడు గోటబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. బౌద్ధ సన్యాసులు, వివిధ దేశాల దౌత్య అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానిగా ప్రమాణం చేయడం మహిందాకు ఇది నాలుగోసారి. ‘‘నా దేశ ప్రజలకు మళ్లీ సేవచేసే అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా హయాంలో దేశం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుంది’’ అని రాజపక్స ట్వీట్ చేశారు.