మహిళల ఆర్థిక బలోపేతానికే ఓటీఎస్‌

ABN , First Publish Date - 2022-01-20T02:46:27+05:30 IST

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓటీఎస్‌ను తీసుకువచ్చిం దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే

మహిళల ఆర్థిక బలోపేతానికే ఓటీఎస్‌
రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

తడ, జనవరి 19 : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం  ఓటీఎస్‌ను తీసుకువచ్చిం దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఓటీఎస్‌ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో  సుమారు 1500 మంది ఓటీఎస్‌కు నగదు చెల్లించారని, అందులో 375 మందికి రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేస్తు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రామయ్య, ఎంపీడీవో శైలేంద్రకుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ మా రంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, హౌసింగ్‌ డీఈ సత్యనారాయణ,  సర్పంచులు ఆర్ముగం,  జయప్రద శశికుమార్‌, లక్ష్మమ్మ,  వైస్‌ ఎంపీపీ రమేష్‌, వైసీపీ నాయకులు ఉచ్చూరు మునస్వామిరెడ్డి, కోదండం, సుందరరెడ్డి, అఫ్రిది తదితరు లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T02:46:27+05:30 IST