మహిళా సాధికారతే లక్ష్యం : ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-28T03:10:13+05:30 IST

మహిళా సాధికారత, స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వ పొదుపు గ్రూపు సభ్యులకు పలు పథకాలను అందుబాటులోకి తీ

మహిళా సాధికారతే లక్ష్యం : ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
పొదుపు మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబరు 27 :  మహిళా సాధికారత, స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వ పొదుపు గ్రూపు సభ్యులకు  పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని పంటవీధి సెంటర్‌లో మంగళవారం మెప్మా ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చేయూత సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణ సమైఖ్య పరిధిలోని 478 గ్రూపుల్లో గల 976 మంది మహిళలు మూడవ విడత ఆసరా పథకం కింద లబ్ధిపొందుతుండడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ డీ రవీంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమేష్‌బాబు, చైర్‌పర్సన్‌ జీ వెంకటరమణమ్మ, వైస్‌ చైర్మన్లు డాక్టర్‌ కెవీ శ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్ధార్‌,  సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, పట్టణ సమైఖ్య ఇన్‌చార్జి సీఎంఎం పీ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T03:10:13+05:30 IST