ఉమెన్ ట్రాఫికింగ్ పై ఆరా తీసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ Sunita laxma reddy

ABN , First Publish Date - 2022-06-23T00:50:28+05:30 IST

మానవ అక్రమ రవాణా పై తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy)ఆరా తీశారు.

ఉమెన్ ట్రాఫికింగ్ పై ఆరా తీసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ Sunita laxma reddy

హైదరాబాద్: మానవ అక్రమ రవాణా పై తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy)ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఎంత వరకు కట్టడి చేయగలిగామో పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నమోదు అయిన కేసుల వివరాలు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.


డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత పోలీసు అధికారులు స్పందిస్తూ ప్రతి రోజు 50 నుండి 60 మిస్సింగ్ కేసులు నమోదు అవుతుండగా అందులో 20 శాతం 15 నుండి 20 సంవత్సరాల లోపు వారేనని వివరించారు. నమోదు అవుతున్న మిస్సింగ్ కేసులలో అధిక శాతం ఇతర రాష్ట్రాల పిల్లలు, బాలకార్మికులేనని, వీరందరినీ గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. 

Updated Date - 2022-06-23T00:50:28+05:30 IST