మహేంద్రుడు చెన్నై వచ్చేశాడు
ABN , First Publish Date - 2020-08-15T09:01:00+05:30 IST
వెటరన్ వికెట్కీపర్.. చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక విమానంలో శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు ప్రత్యేక విమానంలో పియూష్ చావ్లా, కర్ణ్ శర్మ, పేసర్ దీపక్
చెన్నై: వెటరన్ వికెట్కీపర్.. చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక విమానంలో శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు ప్రత్యేక విమానంలో పియూష్ చావ్లా, కర్ణ్ శర్మ, పేసర్ దీపక్ చాహర్తో కలిసి దిగిన ఫొటోను సీఎస్కే వైస్ కెప్టెన్ సురేష్ రైనా ట్విటర్లో పోస్ట్ చేశాడు. సీఎ్సకే శిక్షణ శిబిరం చెన్నైలోని చిదంబరం మైదానంలో ఆదివారం ప్రారంభం కానుంది. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ ఆధ్వర్యంలో వారంపాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఈనెల 21 సీఎ్సకే జట్టు యూఏఈ పయనమవనుంది. సీఎ్సకే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 22న యూఏఈలో జట్టుతో కలవనున్నాడు.