మిల్లర్లతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం: మహేష్‌కుమార్ గౌడ్

ABN , First Publish Date - 2022-04-12T00:05:50+05:30 IST

అధికార పార్టీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.

మిల్లర్లతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం:  మహేష్‌కుమార్ గౌడ్

హైదరాబాద్:  అధికార పార్టీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జీవో 111 ఎత్తివేయడం వల్ల పేద, మధ్య తరగతి రైతులకు ఒరిగిందేమీలేదు, సంపన్నుల కోసమే జీవో 111 ఎత్తి వేస్తున్నారని మండిపడ్డారు.  సీఎం కేసీఆర్ మిల్లర్లతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే వడ్ల కొనుగోలు జరపడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాటకంలో రైతులు బలవుతున్నారని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2022-04-12T00:05:50+05:30 IST