Mahesh Kumar Gowd: రాహుల్‌పై దిగజారి రాజకీయాలు చేయొద్దు

ABN , First Publish Date - 2022-05-03T22:31:01+05:30 IST

వివాహ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నేత Rahul Gandhiపై టీఆర్ఎస్ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Mahesh Kumar Gowd: రాహుల్‌పై దిగజారి రాజకీయాలు చేయొద్దు

హైదరాబాద్: వివాహ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై టీఆర్ఎస్ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు దిగజారి రాహుల్‌గాంధీపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్‌ని తీసుకువెళ్లి తీరుతామని స్పష్టంచేశారు. క్లబ్‌కి వెళ్లి పత్తాలాడే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడుతుంటే సిగ్గేస్తోందన్నారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబమన్నారు.రాహుల్ గూర్చి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.అమరవీరుల త్యాగాల మీద టీఆర్ఎస్ పదవులు అనుభవిస్తున్నదని మహేష్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.

Read more