మరో రెండేళ్లు మహీ..మాతోనే!
ABN , First Publish Date - 2020-08-13T09:27:29+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో రెండేళ్లదాకా తమ జట్టుతోనే కొనసాగుతాడని చెన్నై సూపర్కింగ్స్ (సీఎ్సకే) ఆశాభావం
‘చెన్నై’ సీఈఓ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో రెండేళ్లదాకా తమ జట్టుతోనే కొనసాగుతాడని చెన్నై సూపర్కింగ్స్ (సీఎ్సకే) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే 2022 దాకా మహీ సీఎస్కేకు ఆడతాడనుకుంటున్నామని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డాడు. ‘మహీ 2022 దాకా మా జట్టుతోనే ఉంటాడన్న విశ్వాసం ఉంది. ఐపీఎల్ కోసం రాంచీలో అతను సాధన మొదలుపెట్టాడన్న వార్తలను మీడియా ద్వారానే తెలుసుకున్నా. జట్టుకు సంబంధించిన బాధ్యతలేంటో అతనికి తెలుసు. ఎప్పుడు ఎలా ఏం చేయాలన్న విషయంపై పూర్తి అవగాహనతో ఉంటాడు’ అని విశ్వనాథన్ అన్నాడు.