కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకండి: డీజీపీ
ABN , First Publish Date - 2020-04-02T21:35:14+05:30 IST
కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకండి: డీజీపీ
హైదరాబాద్: కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకావాలని డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనాను ఓడించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుంచి ఇతరులకు సోకకుండా పోలీస్శాఖ సమర్థంగా పనిచేస్తోందని మహేందర్రెడ్డి తెలిపారు.