రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ

ABN , First Publish Date - 2022-05-19T04:51:57+05:30 IST

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ
మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌లో వరదరాజస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

 రూ.20 కోట్లతో వరదరాజ స్వామి ఆలయాభివృద్ధి: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


జగదేవ్‌పూర్‌, మే 18: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మర్కుక్‌ మండల పరిధిలోని వరదరాజ్‌పూర్‌లో వరదరాజస్వామి రథోత్సవాన్ని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వరదరాజస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అప్పాల ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్‌, వైస్‌ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు లక్కాకుల సాహేర నరేష్‌, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మదాసు అన్నపూర్ణశ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య, నాచారం అలయ చైర్మన్‌ హరిపంతులు, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ప్రవీణ్‌, ఎంపీటీసీ కృష్ణయాదవ్‌, సర్పంచులు అచ్చంగారి భాస్కర్‌, అప్పాల స్వరూపమల్లేశం, తుమ్మ కృష్ణ, మొర్సు శ్రీనివా్‌సరెడ్డి, పాపోల్ల రాజు, ర్యాకం స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:51:57+05:30 IST