మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 2,700పైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T02:30:02+05:30 IST

మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ రోజు కూడా 2,700కు పైగా కొత్త కేసులను గుర్తించినట్లు...

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 2,700పైగా కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ రోజు కూడా 2,700కు పైగా కొత్త కేసులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,739 కరోనా కేసులు నమోదయ్యాయి. 120 మంది మరణించారు. 2,234 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82,968కి చేరింది. వీరిలో 2,969 మంది మృత్యువాత పడగా, 37,390 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 42,609 మంది  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-06-07T02:30:02+05:30 IST