మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-08-07T03:06:01+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా ఇక్కడ...

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే..

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా ఇక్కడ 11,514 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,79,779కి పెరిగింది. కాగా ఈ మహమ్మారి కారణంగా మరో 316 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 16,792కి చేరింది. గడచిన 24 గంటల్లో 10,854 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరితో కలిపి మహారాష్ట్రలో ఇప్పటి వరకు 3,16,375 మంది కరోనా నుంచి కోలుకున డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,46,305 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-08-07T03:06:01+05:30 IST