మహారాష్ట్రపై మళ్లీ కరోనా పంజా.. 8వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2022-01-01T03:02:18+05:30 IST

కరోనా మహమ్మారి మహారాష్ట్రను మళ్లీ చుట్టుముట్టేస్తోంది. గత 24 గంటల్లో 8,067 కేసులు నమోదు కాగా

మహారాష్ట్రపై మళ్లీ కరోనా పంజా.. 8వేలకు పైగా కేసులు

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రను మళ్లీ చుట్టుముట్టేస్తోంది. గత 24 గంటల్లో 8,067 కేసులు నమోదు కాగా, 8 మంది కరోనాకు బలయ్యారు. గురువారంతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య ఏకంగా 50 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 34 కేసులు వెలుగుచూశాయి. 95 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పేర్కొంది.


ముంబైలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే విధించిన ఆంక్షలను జనవరి 5వ తేదీ వరకు పొడిగించారు. మరోవైపు నేడు కేరళలో మరో 44 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమైక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియాన్ని మూసివేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. సందర్శకులను ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది.

Updated Date - 2022-01-01T03:02:18+05:30 IST