మహారాష్ట్రలో కొత్తగా 8 వేల పైచిలుకు కరోనా కేసులు!

ABN , First Publish Date - 2021-02-27T03:22:33+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో అక్కడ ఏకంగా 8333 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

మహారాష్ట్రలో కొత్తగా 8 వేల పైచిలుకు కరోనా కేసులు!

ముంబై: మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో అక్కడ ఏకంగా 8333 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో..మొత్తం కేసుల సంఖ్య 21,38,154కు చేరుకుంది. లోకల్ ట్రెయిన్లు ప్రారంభమవడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఓ కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు అలసత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్‌గా నిలిచిన ముంబైలో ఇటీవల రోజువారి కరోనా కేసుల సంఖ్య స్వలంగా పెరిగింది. శుక్రవారం నాడు 1,034 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత మూడు రోజుల్లో ముంబైలో సగటున ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. శుక్రవారం ఒక్కరజునే మొత్తం 4963 మంది కరోనా నుంచి బయటపడ్డారు.  ప్రస్తుతం రాష్ట్ర రికవరీ రేటు 94.35 శాతంగా ఉంది.

Updated Date - 2021-02-27T03:22:33+05:30 IST