మహారాష్ట్రలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
ABN , First Publish Date - 2021-05-14T14:22:12+05:30 IST
మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగడం కలవరం రేపింది....
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగడం కలవరం రేపింది. కొత్తగా 42,582 కేసులు నమోదు కాగా, 850 మంది రోగులు మరణించారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత వారం 160 మంది మరణాలు నమోదు కాగా, తాజాగా కరోనా మరణాల సంఖ్య 850కి పెరిగింది. ప్రస్థుతం మహారాష్ట్రలో మొత్తం కరోనా యాక్టివ్ కేసులు 5,33,294 ఉన్నాయి. ఒక్క ముంబై నగరంలోనే 1952 కరోనా కేసులు వెలుగుచూశాయి. ముంబై నగరంలో కొత్తగా కరోనాతో 68 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 14,040కు పెరిగింది. ముంబై శాటిలైట్ పట్టణాల్లో 5,953 కరోనా కేసులు వెలుగుచూడగా 183 మంది మరణించారు.