Shiv sena రెబల్ ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటో విడుదల
ABN , First Publish Date - 2022-06-22T17:58:16+05:30 IST
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హోటల్లో రెబల్ శివసేన ఎమ్మెల్యేలు గ్రూప్ ఫోటో దిగారు...
గౌహతి(అసోం): మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హోటల్లో రెబల్ శివసేన ఎమ్మెల్యేలు గ్రూప్ ఫోటో దిగారు.శివసేన నాయకుడు, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్ హోటల్ నుంచి అసోం రాష్ట్రంలోని గౌహతి నగరానికి స్థావరం మార్చడానికి ముందు గుజరాత్లోని సూరత్లోని ఒక హోటల్లో గ్రూప్ ఫోటో దిగారు.రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఫొటో దిగుతూ నినాదాలు చేశారు.శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. ఈ ఫొటోను విడుదల చేయడం ద్వారా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ బలాన్ని చూపించారు.