గుడ్లు పెట్టడం మానేసిన కోళ్లు... పోలీసులకు పౌల్ట్రీ యజమానుల ఫిర్యాదు!

ABN , First Publish Date - 2021-04-21T17:09:21+05:30 IST

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పలువురు...

గుడ్లు పెట్టడం మానేసిన కోళ్లు... పోలీసులకు పౌల్ట్రీ యజమానుల ఫిర్యాదు!

పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పలువురు పౌల్ట్రీ యజమానులు విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించారు. ఒక కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్నతరువాత నుంచి తమ పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు గుడ్లు ఇవ్వడం మనేశాయని  వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మూడు నాలుగు పౌల్ట్రీఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసిందన్నారు. 


ఆయా పౌల్ట్రీ ఫారాలలో ఇటువంటి సమస్యే తలెత్తిందన్నారు. ఈ సందర్భంగా లాల్ భోర్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర మోక్షీ మాట్లాడుతూ... తమ వద్దకు నలుగురు పౌల్ట్రీ యజమానులు... తమ కోళ్లు దాణా తిన్న తరువాత నుంచి గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు పెట్టినప్పటి నుంచి ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని వాపోయారు. కాగా ఈ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు సదరు కంపెనీ ప్రతిధులను విచారిస్తున్నారు. అలాగే ఈ విషయమై పశువైద్య అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

Updated Date - 2021-04-21T17:09:21+05:30 IST