Terror Boat : భారీ ఆయుధాలతో మహారాష్ట్ర తీరానికి వచ్చిన ఉగ్రవాద పడవ
ABN , First Publish Date - 2022-08-18T20:05:26+05:30 IST
మహారాష్ట్ర (Maharashtra)లోని రాయగఢ్ జిల్లాకు ఓ పడవ వచ్చింది.
ముంబై : మహారాష్ట్ర (Maharashtra)లోని రాయగఢ్ జిల్లాకు ఓ పడవ వచ్చింది. దానిలో ఏకే-47 తుపాకులు, తూటాలు, మరికొన్ని ఇతర రకాల తుపాకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఉగ్రవాదుల పడవ అని అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు ఈ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా పోలీసులు ఈ పడవ వద్దకు వెళ్ళి నిశితంగా పరిశీలిస్తున్నారు.
అరేబియా సముద్రం హరిహరేశ్వర్ తీరంలో ఈ అనుమానాస్పద పడవను గుర్తించారు. ఇది స్పీడ్ బోట్ అని తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమో అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.