మహారాష్ట్రలో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా

ABN , First Publish Date - 2020-09-29T21:38:14+05:30 IST

మహారాష్ట్రలో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 215 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుటి వరకు 23,033 మంది పోలీసులకు కోవిడ్-19 వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 3,107 పోలీసులకు కరోనా చికిత్స అందిస్తున్నట్లు వైద్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకొని 19,681 మంది పోలీసులు డిశ్చార్జ్ అవగా, కరోనా వల్ల 245 మంది చనిపోయారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2020-09-29T21:38:14+05:30 IST