మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-04-17T02:31:47+05:30 IST

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా పెరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 63,729 కోవిడ్-19  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఏప్రిల్ 11వ తేదీన 63,294 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, మాస్కులు, శానిటైజర్ తప్పని సరిగా వాడాలని పేర్కొంది. 

Updated Date - 2021-04-17T02:31:47+05:30 IST