మహారాష్ట్రలో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా

ABN , First Publish Date - 2020-07-03T12:07:06+05:30 IST

మహారాష్ట్రలో మరో మహిళా ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా వైరస్ సోకింది.....

మహారాష్ట్రలో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా

థానే (మహారాష్ట్ర): మహారాష్ట్రలో మరో మహిళా ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే భర్తకు పరీక్షలు చేయగా ఆయనకు కూడా కరోనా ఉందని తేలడంతో వారిద్దరిని హోం క్వారంటైన్ చేశారు. గతంలో థానే జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కొవిడ్-19 సోకింది. థానే జిల్లాలోనే మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. మహారాష్ట్రలో ఓ హిందీ రచయిత్రి (60) కొవిడ్-19తో మరణించారు. థానే జిల్లాలో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

Updated Date - 2020-07-03T12:07:06+05:30 IST