Maharashtra: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు
ABN , First Publish Date - 2021-12-30T00:50:35+05:30 IST
Maharashtra: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు
ముంబై: 2022 నూతన సంవత్సర వేడుకలపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆంక్షలు విధించింది. గేట్వే ఆఫ్ ఇండియా వంటి ప్రదేశాలలో రద్దీగా ఉండకూడదని మహారాష్ట్ర సర్కారు పౌరులను కోరింది. క్లోజ్డ్ స్పేస్లు 50శాతం సీటింగ్ కెపాసిటీతో మరియు ఓపెన్ స్పేస్లు 25శాతం కెపాసిటీతో ఈవెంట్లను నిర్వహించుకొవచ్చని తెలిపింది. కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో 10 సంవత్సరాల కంటే తక్కువ మరియు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బయటకు వెళ్లకుండా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.