మహారాష్ట్ర Home Ministerకి కొవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-28T16:00:51+05:30 IST
మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ గురువారం కరోనా బారిన పడ్డారు...
నాగపూర్: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ గురువారం కరోనా బారిన పడ్డారు. మంత్రి దిలీప్ వాల్సే నాగపూర్, అమరావతి పట్టణాల్లో పర్యటించి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన నుంచి తిరిగివచ్చిన మంత్రి దిలీప్ అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో మంత్రి దిలీప్ కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రి తన వ్యక్తిగత వైద్యుల సలహా మేర క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి దిలీప్ చెప్పారు. తనతో కలిసి నాగపూర్, అమరావతి నగరాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజలు, పార్టీ నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి దిలీప్ వాల్సే సూచించారు.